KDP: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 100 రోజులలో పరిపాలన అద్భుతంగా చేస్తుందని జనసేన పార్టీ సమన్వయకర్త బసవి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఒకేరోజు అత్యధిక గ్రామసభలు నిర్వహించిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు దక్కుతుందని అన్నారు.