శ్రీకాకుళం: టెక్కలి పాత హైవేపై రోడ్డు ఆక్సిడెంట్లో ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రావివలస మల్లేశ్వరరావు(32) అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతబొమ్మాళికి వచ్చి తిరిగి వెళ్తుండగా టెక్కలి ఆట్ నుంచి దూకి తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.