SKLM: లావేరు మండలం అదపాక ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు శనివారం సందర్శించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు. శాస్త్రీయ సమాజ నిర్మాణానికి మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందన్నారు.