KDP: మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చేయి, చేయి కలిపి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.