KRNL: జిల్లాకు విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును స్టెట్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో హంద్రీ నీవా ద్వారా చెరువులకు నీళ్ళు నింపాలని, అలాగే అలగనూరు రిజర్వాయరు మరమ్మత్తులు, గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.