ప్రకాశం: బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రోమోర్, ఫర్టిలైజర్స్ షాపులను శనివారం మండల వ్యవసాయ అధికారి కుమారి పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు కొన్న రైతులకు బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఎరువులు, పురుగుమందులు అందించాలని షాప్ యజమానులను ఆదేశించారు. అధిక రేట్లకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని షాపు యజమానులకు తెలియజేశారు.