PLD: ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరేలా గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో రూ.70కోట్లతో CC, BT రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.60కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 700 మినీ గోకులాల ఏర్పాటులో భాగంగా 550 మంజూరు చేసామన్నారు.