SRKL: కాశీబుగ్గ-పలాసలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జవహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో సినర్జిన్ కాస్టింగ్, అపోలో ఫార్మసీ, ఫార్మా సంస్థలు హాజరవుతున్నాయని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువు పూర్తి చేసినవారు అర్హులు. 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.