సత్యసాయి: నల్లచేరువు మండలం సంజీవు పల్లి గ్రామంలో శనివారం వ్యవసాయ శాస్త్ర వేత్త రామసుబ్బయ్య, మండల వ్యవసాయ అధికారి భారతి రైతులు సాగు చేసిన టమోటా, వేరుశనగ పంటను పరిశీలించారు. పంటలకు ఆశించే చీడ, పీడల నివారణకు తగు సూచనలు అందించారు. అదే విధంగా రైతులు ఈ పంట తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. పంట నమోదు చేయకుంటే రాయితీలు వర్తించవని తెలిపారు.