NLR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచల శైవ క్షేత్రం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు నెల్లూరు నగరం వనంతోపు సెంటర్కు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వారిని గూడూరు ఏరియా ఆసుపత్రి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.