కృష్ణా: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా, క్యూ లైన్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అక్కడి విధులలో ఉన్న సిబ్బందికి సీపీ ఆదేశాలిచ్చారు.