KRNL: నందవరం మండల కేంద్రంలో స్థానిక దేశాయ్ నెట్వర్క్ కార్యాలయంలో టీడీపీ మండల నాయకులు దేశాయ్ గురు రాజారావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు.