కడప: జిల్లాలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. నగరంలోని ద్వారకా నగర్లోని ఇందిరా భవన్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ATMలను పగులగొట్టి 6 లక్షలు, ఒంటిమిట్టలోను ఎస్బీఐ ఎటీఎంలో 36 లక్షలు నగదును దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.