పశ్చిమ గోదావరి: జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ‘మన ఇల్లు- మన గౌరవం’ పేరిట ఈ నెల 28న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, ఈవోపీ ఆర్డీలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.