శ్రీకాకుళం: ఇచ్చాపురం మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉందని అక్కడ స్థానికులు ఆదివారం పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో తలపెట్టిన జలజీవన్ మిషన్ పథకం కూడా ఈ సమస్యను గట్టెక్కించలేదని వాపోయారు. ముఖ్యంగా A.S పేట, పురుషోత్తపురంలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న జనాభాకు అది సరిపోవట్లేదని అన్నారు.