తూ.గో: కంటైనర్లో ఎద్దులను తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ శనివారం తెలిపారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి జంక్షన్లో అక్రమంగా తరలిస్తున్న 44 ఎద్దులను, కంటైనర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని విజయనగరం నుంచి చిలకలూరిపేటకు తరలిస్తున్నట్లు తెలిపారు. కంటైనర్ను సీజ్ చేశామని తెలిపారు.