KMR: మద్నూర్ మండలం మేనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అశోక్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం 2026-2027 సంవత్సరానికి తై బజార్ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన అవినాష్ రూ.60,000లకు తైబజార్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్కాయ్య, పంచాయతీ కార్యదర్శి హరీశ్, వార్డు సభ్యులు, వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.