KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని దర్శించుకుని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆర్కే రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే దాసరి సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.