MLG: వెంకటాపూర్ మండలం పాపయపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ తుడి సుఖేందర్ రెడ్డి, నర్సింగాపూర్ గ్రామంలో మడిపల్లి రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపురం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు.