RR: ఆమనగల్ మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ పత్యానాయక్, పాలకవర్గం పనులపై దృష్టి సారించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో పగిలిపోయిన మంచినీటి పైపులు పర్యవేక్షించారు. వెంటనే వాటిని మరమ్మతు చేసే పనులను ప్రారంభించారు. సమస్యలను వెంటనే పాలకవర్గం పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.