BDK: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాలని MLA కూనంనేని సాంబశివరావు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం తీర్మానం చేసినా, తుది నిర్ణయం కేంద్ర పరిధిలోనే ఉందని గుర్తుచేశారు.