SDPT: కోహెడ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి JSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత చల్లటి త్రాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ మేరకు గ్రామ ఉపసర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. బాటసారులకు ప్రయాణికులకు ఈ చలివేంద్ర కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.