AP: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు MLA, MLCలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ శాసనసభా పక్ష కార్యాలయాల్లో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ సహా అనేక ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.