TG: హైదరాబాద్ కోఠిలో ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ వారు చేస్తున్నారు. ధర్నా చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు పీఎస్కు తరలించారు. అలాగే, ధర్నాకు వస్తున్న ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.