మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ నిన్న జరిగిన తుది మ్యాచ్ లో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్లో జరిగిన రెండో వన్డేలో ఓడిన తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయిన కివీస్ రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లండ్కు టాప్ ప్లేస్ దక్కింది. మూడో వన్డేకు ముందు తలా 113 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇండోర్ వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత ఈ స్థానాలు తారుమారయ్యాయి. భారత్ 114 స్థానాలతో అగ్రస్థానానికి చేరుకోగా, 113 స్థానాలతో ఇంగ్లండ్ రెండో స్థానానికి పడిపోయింది. 112 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి పరిమితం కాగా, రెండు పాయింట్లు కోల్పోయిన కివీస్ నాలుగో స్థానానికి దిగజారింది.