ఆసిఫాబాద్ పట్టణంలోని జనకపూర్ శ్రీ సీతారామ ఆలయంలో నిర్వహించనున్న కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇవాళ పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సుగుణ సూచించారు.