RR: నందిగామ మండలం సిడితండాలో రూ.10 లక్షలతో గ్రామ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించి మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గబ్రు చౌహన్, తదితరులు పాల్గొన్నారు.