PPM: విక్రంపురంలో ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య తనిఖీ రికార్డులు, వైద్య పరీక్ష పరికరాల పనితీరు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.