KDP: కమలాపురం మండలానికి నూతన తహసీల్దార్గా పామిలేటి శ్రీనివాసరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు న్యాయం చేయడం లక్ష్యమని తెలిపారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ సేవలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని సూచించారు.