PLD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని, పాత మ్యూజియం ప్రాంగణంలో జరిగిన యోగ వేడుకల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమంలో యోగాసనాలు అనుసరించారు. విశాఖ వేదికగా జరిగిన యోగ వేడుకలను స్క్రీన్ మీద తిలకించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు.