SKLM: సరుబుజ్జిలి మండలం గోనెపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం హెచ్ఎం మామిడి దామోదర్ రావు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొని గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ చేపట్టారు.హెచ్ఎం మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.