MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని సేవాలాల్ సేన రాష్ట్ర కో- కన్వీనర్ వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. ఈనెల 26న జరుగు చలో హైదరాబాద్ సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభల కరపత్రాలను శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలన్నారు.