MBNR: తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.