ప్రకాశం: పొదిలి మండలంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఉమ్మడి భూముల సమస్యలను సబ్ డివిజన్తో పరిష్కారిస్తామని తహసీల్దార్ కృష్ణారెడ్డి చెప్పారు. మూగచింతల, కొండయపాలెం, దొండలేరు, సలకనూతల, మాదలవారిపాలెం, రామాయణ కండ్రిక, అక్కచెరువు, జువ్వలేరు, అన్నవరం, నిమ్మవరం, రాములవీడు, టి.సల్లూరు, ఈగలపాడు, కుంచెపల్లి, తుమ్మగుంట రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.