TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి చెప్పారు.