MHBD: చిన్నగూడూరు మండలంలోని అన్ని గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. నిఘా నేత్రాల ద్వారా నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని, దీంతో గ్రామాల్లో భద్రత మరింత పెరుగుతుందని వివరించారు. గ్రామాల అభివృద్ధి, రక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.