MNCL: రైతు భరోసా పథకం దరఖాస్తు గడువు ముగియనున్నదని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కొత్త రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 25 వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ఈ మేరకు రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.