PPM: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భూ సంబంధిత సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షిస్తారని అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకొని సీతంపేట చేరుకుంటారని చెప్పారు.