SRPT: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీబీ ముక్త భారత్ అభియాన్’లో భాగంగా కోదాడ మండలం భీక్యా తండా గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. గ్రామాన్ని సంపూర్ణ క్షయ రహిత పంచాయతీగా తీర్చిదిద్దినందుకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ B. ఝాన్సీ బాలాజీ, పంచాయతీ కార్యదర్శి V. ఉపేందర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.