JN: రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో సోమవారం మత్స్యకారుల వలకు అరుదైన భారీ చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న బంగారు తీగ రకం చేప వలలో పడిందని తెలిపారు. సమాచారం అందుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపను ఆసక్తిగా వీక్షించారు. ఇంత పెద్ద పరిమాణంలో చేపలు కనిపించడం చాలా అరుదని స్థానికులు తెలిపారు.