విశాఖ జిల్లా కోర్టులో నిర్వహించిన న్యాయవాదుల క్రీడా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. షటిల్ (డబుల్స్) పోటీల్లో లాయర్ చెన్నా ప్రమోధిని, ప్రవల్లిక జట్టు ప్రథమ బహుమతి సాధించింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి చీమలపాటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు హాజరయ్యారు.