VZM: దేహదారుఢ్యంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం రింగ్ రోడ్లో విశాల్ మార్ట్ పై అంతస్తులో నూతనంగా అత్యాధునికమైన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.