NLR: ఈ ఏడాదిలో ఆత్మకూరు నియోజకవర్గంలో 274 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. పెరుమాళ్లపాడు వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు సుమారు రూ.32 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మేము ఉన్నాం అన్నారు.