సత్యసాయి: కనగానపల్లి మండలంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనగానపల్లి హెడ్ క్వార్టర్ వద్ద రూ.80 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న శ్రీ భక్త కనకదాస కళ్యాణ మండప నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ పోతులయ్య, డీఈ లక్ష్మీనారాయణ, కనగానపల్లి ఎంపీటీసీ భాస్కర్, గ్రామస్థులు పాల్గొన్నారు.