ఆసియా కప్లో టీమ్ఇండియా ఓమన్పై 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శాంసన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం, 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఒమన్ తరఫున కలీమ్ (64), మీర్జా (51) అద్భుతంగా ఆడారు.