AP: తమిళనాడు బోట్ల విడుదలలో తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ బీద మస్తాన్రావు ఖండించారు. వివాదంపై అధికారులు, మత్యకార గ్రామ పెద్దలతోగానీ చర్చించలేదని తెలిపారు. విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చంద్రబాబు, అధికారులను కోరానని చెప్పారు. వాస్తవాలను బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతానని వెల్లడించారు.