MNCL: ప్రకృతిపై ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలని జన్నారం అటవీశాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. మనుషులకు ప్రకృతి ఇచ్చిన మంచి కానుక వన్యప్రాణులని అన్నారు. వాటిని ఎంత కాపాడుకుంటే మనిషికి అంత భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి జీవి ప్రకృతితో మమేకమై జీవించడమే మంచిదన్నారు.