HYD: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో HYD బోటానికల్ గార్డెన్లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. సుమారు 30 మంది వాకర్స్, సందర్శకులు పాల్గొన్నారు. పిచ్చుకలు పర్యావరణ సమతుల్యతకు కీలకమని అధికారులు తెలిపారు. గూడ్లు తయారు చేసి, ఎండాకాలంలో పక్షుల దాహం తీర్చేందుకు నీటి పాత్రలు చెట్ల నీడలో ఉంచారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.