NRML: జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.