PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన పొత్తూరి రాజు గేట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ప్రస్తుతం భువనేశ్వర్ రైల్వేలో ఇంజినీర్గా పనిచేస్తున్న ఆయన, ఉన్నత చదువుల లక్ష్యంతో ఈ ఘనత సాధించారు. తన అంతిమ లక్ష్యం సివిల్స్ సాధించడమేనని రాజు ఈ సందర్భంగా వెల్లడించారు.